ఈ నెల 25న మాటీవి లో బాహుబలి.. 10 సెకండ్లకు 2.5 లక్షలు

టాలీవుడ్ చరిత్రను తిరగ రాయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 700 కోట్ల కలెక్షన్స్ ను కురిపించుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనాలు క్రియేట్ చేసిన 'బాహుబలి' మరో చరిత్రను సృస్టించబోతోంది. ప్రముఖ మాటివి ఛానల్ 'బాహుబలి' బుల్లితెర ప్రసార హక్కులను 20 కోట్లకు కొనుక్కున్న విషయం తెలిసిందే. ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈసినిమాను అక్టోబర్ 25వ తారీఖున దసరా ప్రీమియర్ షోగా బుల్లితెర పై ప్రసారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
bahubali కోసం చిత్ర ఫలితం
అయితే ఈసినిమాను ప్రసారం చేస్తున్న మాటివి ఈసినిమా మధ్యలో ప్రసారం అయ్యే యాడ్స్ కు 10 సెకండ్లకు 2.5 లక్షల టెలికాస్టింగ్ ఫీ నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి యాడ్ స్ట్రాటజీ ఇప్పటి వరకు బుల్లితెర చరిత్రలో ఏ సినిమా పై ప్రయోగించలేదని టాక్. ఈ యాడ్ టరీఫ్ కు చాల మల్టీ నేషనల్ కంపెనీలు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా బుల్లితెర పై ప్రీమియర్ షోగా ప్రదర్శింప బడుతున్న నేపధ్యంలో ఈసినిమాలో నటించిన ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కల 'బాహుబలి' షూటింగ్ అనుభవాల క్లిపింగ్స్ ను కూడ ఈ ప్రీమియర్ షోకు ప్రత్యేక ఆకర్షణగా మారుస్తారని టాక్.

People Like Too Much