అసోంలో అద్బుతం ఆరునెలల్లో 85 మందికి జన్మనిచ్చిన మహిళ?

ఆరునెలల్లో 85మందికి జన్మనివ్వడమేమిటనుకుంటున్నారా..? సర్కారు సొమ్ముకోసం కక్కుర్తిపడి.. దవాఖానలో లెక్కలు తారుమారుచేసింది. అసోంలోని కరీంగంజ్ ప్రభుత్వ దవాఖానలోని మెటర్నిటీ జాబితాను ఇటీవల ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. అందులో ఆరునెలల్లో 160 కాన్పులు జరిగినట్టు ఉంది. 85సార్లు లిలీ బేగం లష్కర్ అనే మహిళ పేరుంది. 

begum

ఆరునెలల్లో 85సార్లు ఆమె పిల్లలు కన్నట్టుగా ఉందన్నమాట. ఆశ్చర్యానికి గురైన అధికారులు.. ఆరా తీయగా, లిలీ బేగం అనే మహిళ కాన్పుల జాబితాను రూపొందించే నర్సు అని తేలింది. సర్కారు దవాఖానలో కాన్పు చేయించుకునే మహిళలకు ప్రభుత్వం రూ. 500చొప్పున అందజేస్తూ ఉంటుంది. ఆ డబ్బుకోసమే లిలీ బేగం.. తనపేరును జాబితాలో చేర్చినట్టు వెల్లడైంది. లిలీ బేగం అధికారులు సస్పెండ్ చేశారు.

People Like Too Much