నువ్వు పడుకొని సంపాదిస్తే... మేము కూర్చుని తింటాం ?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం వెలుగుచూసింది. తమ రక్తం పంచుకుని పుట్టిన కన్న కుమార్తెను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. అంతేనా ఆ యువతిని చిత్ర హింసలకు గురిచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 

మధ్యప్రదేశ్ రాష్ట్రం, బర్వాణీ జిల్లా, మహావీర్ నగర్‌కు చెందిన సంజయ్ శర్మ, నిర్మల అనే దంపతులకు 17 యేళ్ళ యువతి ఉంది. వీరు తమ కుమార్తెను వ్యభిచార రొంపిలోకి దించేందుకు బలవంత పెట్టడమేకాకుండా, చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చారు. దీంతో ఆ యువతి వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దంపతులను అరెస్టు చేసింది. 

వీరిద్దరిపై హత్యా బెదిరింపు, దాడిచేయడం, సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఆ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ బాలిక గతంలో ఇండోర్‌లో పదో తరగతి విద్యాభ్యాసం చేస్తుండగా, బలవంతంగా చదువు మాన్పించి బర్వాణీకి తీసుకెళ్లి వ్యభిచారం రొంపిలోకి బలవంతంగా దించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ యువతి చాకచక్యంగా తమ బంధువులకు సమాచారం చేరవేసి.. తల్లిదండ్రుల నుంచి తప్పించుకుని మానప్రాణాలను కాపాడుకుంది. 

Related: 
1.మంత్రిగారి ప్యాంట్… పబ్లిక్ లో ఊడింది.!

2.లక్షల్లో సైడ్ ఇన్ కమ్ సంపాదిస్తున్న హీరోయిన్లు

3.డబ్బు కోసం 15 ఏళ్ళ కూతురిని వ్యభిచారం లోకి దింపిన ...

4.రేణుదేశాయ్ సెకండ్ మ్యారేజ్

5.చిరంజీవి అయితే నాకేంటి ... నా రేటు మూడు కోట్లు ......






















People Like Too Much