ఒకే ఒక్క కాల్ తో.. ఒకేసారి వంద మందితో.. ఉచితంగా!

ఇంటర్నెట్ ప్రపంచంలో సామాజిక మాధ్యమాల కారణంగా ఈ ప్రపంచం కుగ్రామంగా మారిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సోషల్ మీడియా వేదికల మధ్య కూడా విపరీతమైన పోటీ ఉండడంతో, ప్రతీ వేదిక రోజుకో కొత్త ఆలోచనలతో సోషల్ మీడియా ప్రేమికులను ఆకర్షిస్తుంది.
hike1
తాజాగా ప్రముఖ సామాజిక వేదిక హైక్ మెసెంజర్ సరికొత్త అవకాశాన్ని మొబైల్ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. హైక్ ఇప్పటివరకు మెస్సెంజర్ గా పనిచేయగా, ఇప్పుడు ఉచిత గ్రూప్ కాల్ కూడా చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఒకే ఒక్క కాల్ తో ఏకంగా ఒకేసారి వంద మందితో ఉచితంగా మాట్లాడే అవకాశం కల్పిస్తూ సేవలు ప్రారంభించింది. ఈ కొత్త సదుపాయాన్ని తాజాగా హైక్ మెస్సేంజర్ యజమాని, టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ తనయుడు కెవిన్ మిట్టల్ ప్రారంభించారు. అయితే, ఈ సేవలు ప్రస్తుతానికి 4జీ, వైఫై ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లకు అందిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికల్లా ఐవోఎస్, విండోస్ ఫోన్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

People Like Too Much