రాజధాని ప్రాంతంలోని భూములను రైతులకు ఇష్టంలేకుండా తీసుకోవద్దని పవన్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఆ మేరకు ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు అండగా ఉంటానని శపథం కూడా చేశారు.
కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటికే 30 వేల ఎకరాలు సేకరించేశారు. ఐతే.. ఇప్పటివరకూ రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిందే తీసుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఇకపై భూములు ఇవ్వని రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించనున్నారు. దీనికి రంగం సిద్ధమైంది. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా.. రాజధాని భూములను ప్రభుత్వం గుంజేసుకుంటుందన్నమాట. అమల్లో ఉన్న చట్టం ప్రకారం పరిహారం ఇస్తారు.
ఈ భూసేకరణ చట్ట ప్రయోగాన్ని పవన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన ఆ మధ్య ట్వీట్ ద్వారా స్పందించి.. బలవంతంగా తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. ఆ తర్వాత మంత్రి నారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అన్నా... భూసేకరణ మాత్రం ఆగే పరిస్థితి లేదు. చంద్రబాబు కూడా చట్టం ప్రకారం భూ సేకరణ చేయవలసిందే అంటున్నారు.
ఈ భూసేకరణ చట్ట ప్రయోగాన్ని పవన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన ఆ మధ్య ట్వీట్ ద్వారా స్పందించి.. బలవంతంగా తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. ఆ తర్వాత మంత్రి నారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అన్నా... భూసేకరణ మాత్రం ఆగే పరిస్థితి లేదు. చంద్రబాబు కూడా చట్టం ప్రకారం భూ సేకరణ చేయవలసిందే అంటున్నారు.