'రుద్రమదేవి'ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన గుణశేఖర్ తదుపరి కొనసాగింపు సినిమాకోసం 'ప్రతాపరుద్రుడు - ది లాస్ట్ ఎంపరర్' అనే టైటిల్ని కూడా రిజిస్టర్ చేయించారు.
'రుద్రమదేవి' చివర్లో తదుపరి చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు చూపించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మరి తెరపై 'ప్రతాపరుద్రుడు'గా ఎవరు నటించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహేష్బాబుతోకానీ, అల్లు అర్జున్తోకానీ ఆ సినిమాని తీసే ఆలోచనలో గుణశేఖర్ ఉన్నట్టు తెలుస్తోంది. సూపర్ హిట్ 'బాహుబలి'కి 'బాహుబలి2' తెరకెక్కనుండగా, ఇప్పుడు 'రుద్రమదేవి'కి కూడా కొనసాగింపుగా 'ప్రతాపరుద్రుడు' పేరుతో మరో సినిమాని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.
కాకతీయ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి ప్రతాపరుద్రుడు. రుద్రమదేవికి మనవడు అవుతాడు. ఆయన కథతోనే సినిమా తెరకెక్కబోతోంది. అంటే అనుష్క కు మనవడుగా చేసేది అల్లు అర్జున్ లేదా మహేష్ తేలాలి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రుద్రమదేవి'. అల్లు అర్జున్, రానా, కృష్ణంరాజు కీలక పాత్రలు పోషించారు. గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.
'రుద్రమదేవి' చివర్లో తదుపరి చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు చూపించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మరి తెరపై 'ప్రతాపరుద్రుడు'గా ఎవరు నటించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహేష్బాబుతోకానీ, అల్లు అర్జున్తోకానీ ఆ సినిమాని తీసే ఆలోచనలో గుణశేఖర్ ఉన్నట్టు తెలుస్తోంది. సూపర్ హిట్ 'బాహుబలి'కి 'బాహుబలి2' తెరకెక్కనుండగా, ఇప్పుడు 'రుద్రమదేవి'కి కూడా కొనసాగింపుగా 'ప్రతాపరుద్రుడు' పేరుతో మరో సినిమాని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.