మహబూబ్ నగర్ జిల్లా కిషన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వారానికి ఒకే గుడ్డు పెట్టడం పైన గవర్నర్ నరసింహన్ సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారానికి ఒక రోజు మాత్రమే విద్యార్థులకు గుడ్డు పెడుతున్న విషయం తెలుసుకొని ఆగ్రహించారు. జిల్లా వ్యాప్తంగా ఎలా ఉందో ఆరా తీయాలని కలెక్టర్ను ఆదేశించారు. మధ్యాహ్న భోజన శాలలకు సబ్సిడీ గ్యాస్ అందేలా చూడాలని ఆదేశించారు.
గవర్నర్ నరసింహన్ కిషన్ నగర్ గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించిన గ్రామంలోని సమస్యలపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార వివరాలను సైతం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ నరసింహన్ కిషన్ నగర్ గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించిన గ్రామంలోని సమస్యలపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార వివరాలను సైతం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.