34 ఏళ్ల తరువాత కనిపించిన శివుడు ?




అది సప్తనదీ సంగమ క్షేత్రం! మూడున్నర దశాబ్దాల కిందట భీమలింగేశ్వరుడు అక్కడ జలాధివాసమయ్యాడు! ఆలయ ప్రధాన వేద పండితుల కృషి ఫలితంగా ఇన్నాళ్లకు మళ్లీ భీమలింగేశ్వరుడు దర్శనమిచ్చాడు. 

దీంతో మళ్లీ ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక, చారిత్రక, ఇతిహాస అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీశైల జలాశయ నిర్మాణం పూర్తి కావడంతో సరిగ్గా 34 ఏళ్ల కిందట ప్రాజెక్ట్‌ వెనుక జలాల్లో భీమలింగేశ్వరుడు జలాధివాసం అయ్యాడు. 

అయితే, 13 ఏళ్లనుంచి ఏటా వేసవిలో సప్తనదీ జలాల నుంచి సంగమేశ్వర క్షేత్రం బయటపడినా.. పూడిక కారణంగా భీమలింగం మాత్రం ఆనవాళ్లు కూడా కనిపించకుండా మట్టి పేరుకుపోయింది.


People Like Too Much