భలే చాన్సులే...! ఇద్దరు మహిళలతో సహజీవనం..ఇద్దరినీ ఇచ్చి పెళ్లి చేశారు?




ఖమ్మం జిల్లాలో వింత వివాహం జరిగింది. వాజేడులో మేక రమేష్‌ అనే వ్యక్తి ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. వాజేడు మండలం, జంగాలపల్లికి చెందిన మేక రమేష్‌.. దేవి, సుషిత అనే ఇద్దరు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. 

వారి విషయం ఊరంతా తెలిసింది. కుల, ఆచారాల ప్రకారం సహజీవనం చేస్తే బహిష్కరణ శిక్ష విధించే అవకాశం ఉంది. దీంతో భయపడిన రమేష్‌ తరఫు బంధువులు ఇద్దరు మహిళలను ఒప్పించి... రమేష్‌తో వివాహం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


People Like Too Much