నాగార్జున యూనివర్శిటీలో రిషికేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య
ఘటనలో ఆర్కిటెక్చర్ ప్రిన్స్పాల్ను సస్పెండ్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరిపే
కొద్ది ర్యాగింగ్కు సంబంధించిన దారుణమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న
ముందురోజు రిషికేశ్వరిని సీనియర్ విద్యార్థులు తీవ్రంగా వేధించారని, అర్ధనగ్నంగా హాస్టల్
గదిలో నడిపించి... దాన్ని సెల్లో చిత్రీకరించినట్లుగా వెల్లడయింది..
తర్వాత ఆ వీడియోను
ఇతరులకు పంపించారని, తమతో సన్నిహితంగా ఉండకపోతే ఈ వీడియోలు బహిర్గతం చేస్తామని సీనియర్లు
బెదిరించినట్లుగా తెలియవచ్చింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన రిషికేశ్వరి ఆత్మహత్య
చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అనిషా, శ్రీనివాస్ అనే సీనియర్ విద్యార్థులతోపాటు శ్రీచరన్
అనే లెక్చరర్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా రుషికేశ్వరి మృతి కేసులో ఆర్కిటెక్చర్
కళాశాల ప్రిన్సిపల్ బాబూరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విద్యార్థినులతో
ప్రిన్సిపాల్ బాబూరావు అసభ్యకర ప్రవర్తనను విద్యార్థినులు ఫోన్లో చిత్రీకరించి విచారణ
కమిటీకి అందజేశారు. మీడియా సమక్షంలో వాటిని ప్లే చేయాలని విద్యార్థినులు డిమాండ్
చేశారు