కరెన్సీ నోటు పై కలాం కు చోటు కల్పించాలి!

మాతరం గాంధీని చూడలేదు, కానీ మేం చూసిన గాంధీవి నువ్వే, మా స్పూర్తి ప్రధాతవు నువ్వే ..అంటూ కలాంకు సలాం చేశారు. మరికొంత మందైతే కరెన్సీ నోట్లపై కలాం ఎందుకుండకూడదు అంటూ ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి, భారతరత్న అవార్డీ, దేశ అత్యున్నత రాజ్యంగ బద్ద పదవిని అలంకరించిన వ్యక్తి, అన్నింటికి మించి అద్బుత శక్తి, ఇంకా చెప్పాలంటే కల్మషం లేని మనిషి, గాంధీని మించిన అహింసావాది. 

karensi  notu pai kalaam ku
ఇన్ని లక్షణాలు ఉన్న కలాంకు కరెన్సీ మీద ఉండే అర్హత నూటికి నూరు శాతం ఉంది అంటూ తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. ఎలాగో ప్రభుత్వం కూడా ఫ్లాస్టిక్ కరెన్సీని వాడుకలోకి తేవాలనే ప్రయత్నంలో ఉంది కాబట్టి.. 100 ,500,1000 నోట్లలో ఎదో ఒక కరెన్సీ ని అబ్దుల్ కలాం ఫోటో తో విడుదల చేయాలనే డిమాండ్ లువినిపిస్తున్నాయ్ ..

ఇండియన్ కరెన్సీ స్టార్ట్ అయినప్పటి నుండి కరెన్సీ నోటు పై గాంధీ ఫోటోనే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు ఉన్నపలంగా గాంధీని తొలగించాల్సిన అవసరం లేనప్పటికీ, కలాం కు కూడా ఇండియన్ కరెన్సీ లో స్థానాన్ని కల్పించాలని కొరుతున్నారు కలాం అభిమానులు. ఇదిగో వాళ్లు రూపొందించిన నినాదాన్ని మీరూ చూడండి ఈ ఫోటో లో. మరి మీరేమంటారు. ఇండియన్ కరెన్సీ హిస్టరీలోకి తొంగి చూస్తే.. ఇండియాలో మొదటి సారిగా షేర్‌షా సూరి ప్రవేశపెట్టాడని భావిస్తున్నారు. 

ఇక రూపాయి కాగితాలను మొదటగా ముద్రించినవారు "బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్" (1770-1832), స్వాతంత్ర్యానికి ముందు తిరువాన్కూరు రూపాయి, హైదరాబాదు రూపాయి, కచ్ కోరీ.. అంటూ డిఫరెంట్ గా ఉండేవి. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక, వీటన్నిటినీ తీసివేసి భారత రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. 1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించారు. 5 రూపాయల నుండి 1000రూపాయల వరకు ఉన్న నోట్లను మహత్మాగాంధీ శ్రేణి అంటారు.

People Like Too Much