పెళ్ళాం చికెన్ కూర చేయలేదని ....?


చికెన్ కోసం చిత్ర ఫలితం

ఈ స్పీడ్ యుగంలో ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి పెరగడంతో చిన్నచిన్న విషయాలకే కోపోద్రిక్తులవుతున్నారు. ఆ కోపంలో వారు తీసుకునే నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. చంపాలన్న కసో లేదంటే చచ్చిపోవాలన్నా కోపమో వస్తుంది. చేస్తున్నది తప్పో రైటో అని రెండు నిమిషాలు ఆలోచిస్తే.. అనర్ధాలు జరగవు. కాని, అలా ఆలోచించే మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇక విషయానికి వద్దాం. చికెన్ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ అనంతరం భర్త ఫ్యాన్ ను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇక వివరాలలోకి వెళ్తే…

కూకట్ పల్లిలోని రామకృష్ణా నగర్ లో నివాసం ఉండే కారు డ్రైవర్ మధు ఆదివారం రాత్రి సినిమా కు వెళ్లి వచ్చాడు. భార్యను వచ్చే సరికి చికెన్ తెచ్చి వండమని చెప్పాడట. కాని, భార్య ఆ పని చేయలేదు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరిమధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం భార్య.. చికెన్ తెచ్చేందుకు బయటకు వెళ్ళింది. తిరిగి వచ్చే సరికి భర్త ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.


People Like Too Much