ఓ యాడ్ లో చూపించినట్లు ఐడియా కెన్ ఛేంజ్ యువర్ లైఫ్ అన్నట్లు.. మత్సకారుల ఓ ఐడియా కాసులు కురిపిస్తోంది. ఏంటా ఐడియా అనుకుంటున్నారా..? అదేంటంటే ఎలాగూ వేటకు వెళ్లలేరు కాబట్టి పుష్కరాలు జరుగతున్న ఘాట్ లలో చిన్న చిన్న బోట్ లు వేసుకొని తిరుగుతున్నారు.
పుష్కరాలకు వచ్చిన భక్తులు తమ కోరికను తీర్చాలంటూ గోదావరి తల్లికి నాణెలు వదులుతుంటారు. ఒక రూపాయి, రెండు ఐదు, పది రూపాయల నాణేలను వదలుతుంటారు. అయితే ఈ డబ్బుల మీదే మత్పకారులు దృష్టి సారించారు. చిన్న చిన్న బోట్ లలో తిరుగుతూ అయస్కాంతాలను కర్రలకు చుట్టి నీళ్లలోకి వదులుతున్నారు.
అలా నీటిలోకి వదలడం వల్ల నాణేలు అయస్కాంతానికి అతుకుతున్నాయి. ఇంకేముంది వాటిని అలా ఒడిసిపట్టి... కాసుల వర్షంలో తేలుతున్నారు. అయినా తెలివి ఉండాలే కానీ ఆదాయానికి కొదువా చెప్పండి .ఏమి ఐడియా రా మావా. .. ?