తానెంతో బిజీగా ఉన్నది చెబుతూ.. విదేశాలకు వెళ్లి వచ్చేటప్పుడు చాక్లెట్లు తీసుకొస్తారని.. వాటిని కొనటానికి కూడా సమయం చిక్కలేదని వాపోయారు.
తాజాగా.. శనివారం అర్థరాత్రి మరోసారి విదేశీ పర్యటనకు ఏపీ ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు. బ్యాంకాక్ వయాగా జపాన్ను ఆయన ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు.. పలు విదేశీ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు.
ఇక.. భారతీయ రాయబారి ఏర్పాటు చేసే విందులోనూ పాల్గొననున్నారు. పలు కంపెనీలతో చర్చలు జరపటంతో పాటు.. అంతర్జాతీయంగా మాంచి ఆర్థిక సంస్థగా పేరున్న మిజుహుతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
నవ్యాంధ్రలో వర్తక.. వాణిజ్య పారిశ్రామిక రంగాలకు ఆర్థిక సహకారానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే ఈ సంస్థతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. మరి.. గత పర్యటనలో చాక్లెట్లు కొనటానికి కూడా తీరిక లేని చంద్రబాబు ఈసారైనా.. చాక్లెట్లు కొంటారా? అన్నది చూడాలి.